Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతులకు అండ.. RRR సాయం

Webdunia
సోమవారం, 5 జులై 2021 (21:14 IST)
RRR
వైసీపీ అధినేత, సీఎం జగన్‌తో విభేదించడం ఓ ఎత్తయితే నిత్యం ఆయన్ను టార్గెట్ చేస్తూ లేఖలు కూడా సంధిస్తున్న వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ కీలక వ్యక్తిగా మారిపోయారు. 
 
గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, తనపై దాడుల్ని దీటుగా ఎదుర్కొంటున్న రఘురామ ఏకంగా సీఎం జగన్ తోనే సై అంటే సై అంటున్నారు. దీంతో ఏపీలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు కంటే ఆయనకే ఎక్కువగా మైలేజ్ పెరుగుతోంది. 
 
ఇప్పటివరకూ మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాష్ట్రంలోనే పోరాటం సాగిస్తున్న అమరావతి జేఏసీ.. ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్లమెంటుతో పాటు జాతీయ స్థాయికి తమ పోరును తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది.
 
ఇందుకోసం అమరావతి జేఏసీ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సాయం కోరింది. ఈ మేరకు అమరావతి రైతులు, జేఏసీ నేతలు రఘురామకు లేఖలు రాశారు. అమరావతి వ్యవహారాన్ని జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు, పార్లమెంటులో ప్రస్తావించేందుకు సహకరించాలని రఘురామను వారు కోరారు.
 
అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా ఇప్పటికే కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్న జేఏసీ నేతలు, రైతుల విజ్ఞప్తికి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు అంగీకరించారు. పార్లమెంటులో అమరావతి అంశం ప్రస్తావించారంటూ రైతులు చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన రఘురామ... అమరావతి ప్రజలకు మద్దతిస్తానని ప్రకటించారు. దీంతో ఇక పార్లమెంటు వేదికగా అమరావతి పోరును తీసుకెళ్లేందుకు రఘురామ రూపంలో రైతులకు ఓ అండ దొరికినట్లయింది. 
 
గత టీడీపీ ప్రభుత్వంలో రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి నిర్మాణం పూర్తి కాకుండానే చంద్రబాబు అధికారం కోల్పోయారు. ఆ తర్వాత కూడా రాజధానిలో పలుమార్లు పర్యటించారు. అయినా రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదనే ప్రచారం జరుగుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments