Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతులకు తిరుమల దర్సనభాగ్యం కల్పించారు.. కానీ?

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (18:50 IST)
44 రోజుల పాటు అలుపెరగకుండా పాదయాత్ర చేసిన అమరావతి రైతులకు ఎట్టకేలకు టిటిడి దర్సనభాగ్యం కల్పించింది. చివరి వరకు టిటిడి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. కానీ చివరి రోజు పాదయాత్ర ముగిసిన తరువాత టిటిడి రైతులను దర్సనానికి అనుమతిస్తామని తెలిపింది.

 
మొదట్లో అమరావతి రైతులు పెట్టుకున్న 500 మంది కన్నా ఎక్కువగానే టోకెన్లను జారీ చేసింది. ఒకేరోజు 850 మందికి టోకెన్లను మంజూరు చేసింది. సుపథం ద్వారా శ్రీవారిని దర్సించుకునే అవకాశాన్ని కల్పించింది. 

 
దీంతో ఈరోజు ఉదయం టోకెన్లను తీసుకున్న అమరావతి రైతులు అలిపిరి పాదాల మండపం నుంచి గోవింద నామస్మరణలు చేసుకుంటూ తిరుమలకు బయలుదేరి వెళ్ళారు. సగంమంది కాలినడకన వెళితే మరికొంతమంది మాత్రం సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు వెళ్ళారు. 

 
మధ్యాహ్నం 12 గంటల నుంచి 120 మంది చొప్పున రాత్రి 8 గంటల వరకు 850 మంది శ్రీవారిని దర్సించుకుంటున్నారు. మొదట్లో టిటిడి ధర్మకర్తలమండలి వెనుకడుగు వేసింది. అసలు శ్రీవారిని దర్సించుకుంటామా అన్న అనుమానం చాలామందిలో నెలకొంది. కానీ చివరకు పాదయాత్రగా వచ్చిన రైతులకు దర్సనభాగ్యం కల్పించకపోతే విమర్సల పాలవుతామని భావించిన టిటిడి ఛైర్మన్ రైతులకు టోకెన్లను మంజూరు చేశారు.

 
అయితే మొదటిరోజు సగం, మరుసటి రోజు మరోసగం టోకెన్లను ఇవ్వాలని భావించారు. కానీ ఒకేరోజు దర్సనం కల్పిస్తే సరిపోతుందన్న భావనతో ఈరోజే టోకెన్లన్నింటినీ మంజూరు చేసేశారు. దీంతో ఎంతో సంతోషంతో అమరావతి రైతులు తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments