Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామం?

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (08:29 IST)
నవ్యాంధ్ర రాజధాని కోసం అమరావతి రైతులు నిర్వహిస్తూ వచ్చిన ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతేనంటూ ఇటీవల ఆంధ్రప్రదశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో రాజధాని ప్రాంత రైతులు వందల రోజులుగా కొనసాగిస్తూ వచ్చిన ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించాలన్న ఆలోచనలో జేఏసీ నేతలు ఉన్నారు. 
 
ఇదే అంశంపై చర్చించేందుకు ఇటీవల సమావేశమైన జేఏసీ నేతలు... ఏపీ రాజధాని అమరావతే అని కోర్టు తేల్చి చెప్పినందున ఉద్యమానికి తాత్కాలికంగా కొంత విరామం ప్రకటించాలని కొందరు నేతలు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే, ప్రధాన ఉద్యమ శిబిరాలు మాత్రం కొనసాగించాలని మరికొందరు చెప్పారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల వరకు కొనసాగించి ఆ తర్వాత తాత్కాలిక విరామం ప్రకటిద్దామని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. 
 
అమరావతే ఎలగూ రాజధాని అని కోర్టు చెప్పింది కాబట్టి అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఉద్యమం చేపడుదామని రైతులు న్యాయకు పేర్కొన్నారు. అయితే, సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వరకు శిబిరాలు కొనసాగించి ఆ తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకుని తదుపరి కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో రాజధాని ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments