Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామం?

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (08:29 IST)
నవ్యాంధ్ర రాజధాని కోసం అమరావతి రైతులు నిర్వహిస్తూ వచ్చిన ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతేనంటూ ఇటీవల ఆంధ్రప్రదశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీంతో రాజధాని ప్రాంత రైతులు వందల రోజులుగా కొనసాగిస్తూ వచ్చిన ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించాలన్న ఆలోచనలో జేఏసీ నేతలు ఉన్నారు. 
 
ఇదే అంశంపై చర్చించేందుకు ఇటీవల సమావేశమైన జేఏసీ నేతలు... ఏపీ రాజధాని అమరావతే అని కోర్టు తేల్చి చెప్పినందున ఉద్యమానికి తాత్కాలికంగా కొంత విరామం ప్రకటించాలని కొందరు నేతలు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే, ప్రధాన ఉద్యమ శిబిరాలు మాత్రం కొనసాగించాలని మరికొందరు చెప్పారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల వరకు కొనసాగించి ఆ తర్వాత తాత్కాలిక విరామం ప్రకటిద్దామని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. 
 
అమరావతే ఎలగూ రాజధాని అని కోర్టు చెప్పింది కాబట్టి అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఉద్యమం చేపడుదామని రైతులు న్యాయకు పేర్కొన్నారు. అయితే, సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వరకు శిబిరాలు కొనసాగించి ఆ తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకుని తదుపరి కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో రాజధాని ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments