Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన ఖైదీ నంబరు 6093.. ఈయన ఖైదీ నంబర్ 150

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (14:57 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇపుడు రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రకటనను విపక్ష పార్టీలతో పాటు.. రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా, అమరావతి ప్రాంత ప్రజలు సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా రాజధాని ప్రాంతం యుద్ధభూమిగా మారింది. 
 
అయితే, సీఎం జగన్ వ్యాఖ్యలకు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించారు. మూడు రాజధానులను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అందువల్ల సీఎం జగన్‌ ప్రకటనను ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. 
 
ఈ పరిస్థితుల్లో చిరంజీవి చేసిన ప్రకటనపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఖైదీ నంబర్ 6039 అయితే చిరంజీవి 150 అంటూ మండిపడుతున్నారు. ఏదో రాజకీయ లబ్ది కోసమే చిరంజీవి అలా వ్యాఖ్యానించారన్నారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments