Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదీఇదీ వద్దు తిరుపతిని రాజధానిని చేయాలి : చింతా మోహన్

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (14:26 IST)
కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ ఇపుడు సరికొత్త పల్లవిని అందుకున్నారు. ఏపీకి మూడు రాజధానులు రావొచ్చంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాజధాని అమరావతి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు నిరసలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో చింతా మోహన్ రాజధానిపై స్పందించారు. తిరుపతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇప్పటికి నాలుగు పర్యాయాలు మారిన రాజధాని, ఐదోసారి మారడం తథ్యమని అన్నారు. 
 
ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో అమిత్ షా ఇంటి చుట్టూ తిరుగుతోందని, జగన్, చంద్రబాబు ఇద్దరూ అమిత్ షా గుప్పిట్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాజా పరిణామాల నేపథ్యంలో, తిరుపతి నగరమే ఏపీకి సరైన రాజధాని అని, 1953లోనే తిరుపతిని రాజధాని చేయాలనుకున్నారని చింతా మోహన్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments