Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని మంటలు : మందడంలో మహిళలపై పోలీసులు దాడి

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (15:46 IST)
రాజధాని అమరావతి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని రైతుల పరిరక్షణ సమితి పిలుపు మేరకు శుక్రవారం నుంచి సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. దీంతో రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల ప్రజలు సమ్మెకు దిగారు. 
 
ఈ సమ్మెలోభాగంగా, శుక్రవారం మధ్యాహ్నం మందడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళా రైతులను పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించబోయారు. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు ఎదురుతిరిగి, వాగ్వివాదానికి దిగారు. 
 
రైతులను పోలీసులు వాహనంలో ఎక్కిస్తుండగా అడ్డుపడ్డారు. దీంతో పోలీసు వాహనం టైరు చేతిపైకి ఎక్కడంతో ఓ రైతుకి గాయాలయ్యాయి. పోలీసుల తీరు సరిగాలేదంటూ పోలీసు వాహనానికి ఎదురుగా రైతులు పడుకున్నారు. దీంతో వారిని పోలీసులు అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 
 
మహిళల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనను వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ముక్తకఠంతో ఖండించారు. పోలీసుల తీరును ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. అధికార పార్టీ నేతల చేతిలో పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments