Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలులో పసుపు పండగు - నేటి నుంచి టీడీపీ మహానాడు

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (07:16 IST)
ఒంగోలు పట్టణం పసుపు మయమైంది. తెలుగుదేశం పార్టీ మహానాడుకు వేదికగా నిలించింది. రెండు రోజుల పాటు ఒంగోలు శివారు ప్రాంతమైన మండువవారిపాలెంలో ఈ పండుగను నిర్వహించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. శుక్ర, శనివారాల్లో టీడీపీ మహానాడు జరుగనుంది. ఇందుకోసం పార్టీ అధినేత చంద్రబాబుతో ఆ పార్టీ నేతలంతా ఇప్పటికే ఒంగోలుకు చేరుకున్నారు. 
 
ఈయన గురువారం మధ్యాహ్నానికే ఒంగోలుకు చేరుకున్నారు. నగరంలో మునుపెన్నడూ లేనివిధంగా తెదేపా నిర్వహించే అతిపెద్ద మహోత్సవం మహానాడు కావడంతో అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడకు తరలి వస్తున్నారు. 
 
ఒంగోలు నగరంలో ప్రధాన వీధుల్లో ఫ్లెక్సీలు, పార్టీ జెండాలతోపాటు, ముఖ్యనేతల ఫొటోలతో ముద్రించిన ఫ్లెక్సీలు, ఎన్టీఆర్‌ శత జయంతి ఫ్లెక్సీలు కళక ళలాడుతున్నాయి. నగర శివారులతోపాటు ప్రధాన సెంటర్లు, ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో మహా నాడుకు స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. జాతీయ రహదారి వెంట మంగమ్మకాలేజి వద్ద నుంచి పసుపు తోరణాల ప్రత్యేక ఆకర్షణగా మారాయి. 
 
మరోవైపు మహానాడు ప్రాంగణంలో ఎటు చూసినా పసుపుమయంగా ఏర్పాట్లు చేశా రు. విద్యుద్దీపాల అలంకరణ, మహానాడుకు విచ్చేసేవారికి వేర్వేరుగా గ్యాలరీలు, వీఐపీ గ్యాలరీలు, రక్తదాన శిబిరాలు, తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల గొప్పతనం చాటుతూ ఫొటో ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా విచ్చేసే లక్షలాది మంది కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ఎన్టీఆర్‌ అభిమానుల కోసం అవసరమైన రుచికరమైన వంటకాలను ఈ మహానాడులో వడ్డించేలా ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments