Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తి : మంత్రి నారాయణ

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (08:47 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులన్నీ వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక పనులను తిరిగి ప్రారంభించామన్నారు. మిగిలిన పనులను కూడా దశల వారీగా చేపడుతామన్నారు. అలాగే, రాజధాని అమరావతి పరిధిలో సుందరీకరణ పనులు కూడా ఒక్కొక్కటిగా ప్రారంభిస్తామని ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టించే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా అమరావతిలో మరో రూ.2723 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు సీఎం ఆమోదం తెలిపారు. సీఆర్డీయే 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
జూన్ 12వ తేదీ నాటికి 1.18 లక్షల టిడ్కో గృహాల నిర్మాణ పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరోవైపు, ఇప్పటివరకు రూ.47288 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments