Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి నిర్మాణ పనులు మూడేళ్లలో పూర్తి : మంత్రి నారాయణ

ఠాగూర్
మంగళవారం, 24 డిశెంబరు 2024 (08:47 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులన్నీ వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక పనులను తిరిగి ప్రారంభించామన్నారు. మిగిలిన పనులను కూడా దశల వారీగా చేపడుతామన్నారు. అలాగే, రాజధాని అమరావతి పరిధిలో సుందరీకరణ పనులు కూడా ఒక్కొక్కటిగా ప్రారంభిస్తామని ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ప్రపంచ బ్యాంకు అండతో అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరుగులు పెట్టించే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా అమరావతిలో మరో రూ.2723 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు సీఎం ఆమోదం తెలిపారు. సీఆర్డీయే 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
జూన్ 12వ తేదీ నాటికి 1.18 లక్షల టిడ్కో గృహాల నిర్మాణ పూర్తి చేసి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వసతుల కల్పనకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని రింగ్ రోడ్డు, విజయవాడ బైపాస్ రోడ్డు ప్రాజెక్టుపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. మరోవైపు, ఇప్పటివరకు రూ.47288 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఆర్డీయే ఆమోదం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments