Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్ని ప్రాంతాలు అభివృద్ధి ... రాజధాని అంశంపై మంత్రి బొత్స

Webdunia
గురువారం, 29 ఆగస్టు 2019 (20:00 IST)
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చూసుకొని రాజధాని అంశంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది ఆలోచిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సీఆర్డీఏ అధికారులతో సీఎం జగన్ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స గతంలో రాజధాని అంశంలో బ్యాంకులు, ఆర్ధిక సంస్థలతో ఒప్పందాలు లేవని, ఇప్పుడు అన్ని పరిస్థితులను ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

రాజధాని అంటే ఐదు కోట్ల మంది ప్రజలదని, ఏ ఒక్క సామాజిక వర్గానిదో కాదన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని, ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష్యలేదన్నారు.

అమరావతిలో వరదల ముంపు ఉందని, ప్రభుత్వంలో రాజధానిఫై చర్చ జరుగుతుందని బాంబు పేల్చిన బొత్స సత్యనారాయణ మరోసారి అయన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించదన్న బొత్స రాజధాని విషయంలో వరదల గురించి మాత్రమే మాట్లాడానని, శివరాకృష్ణ రిపోర్ట్ పరిగణలోకి తీసుకోలేదని చెప్పానన్నారు.

చెన్నై, ముంబై ఎప్పుడో కట్టిన రాజధానులని వాటితో అమరావతికి పోలిక ఏమిటని, ఆ ప్రాంతాలలో వరద వస్తుందంటే అక్కడ రాజధానులు కట్టేవారా అని ప్రశ్నించిన మంత్రి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, తద్వారా 25 లక్షల కోట్ల సంపద సృష్టించబోతున్నామన్నారు.

ప్రస్తుతం రాజధాని పనులపై విచారణ జరుగుతుందని, పూర్తిస్థాయి విచారణ అనంతరం రాజధానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments