Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశవాణి చిన్నమ్మ ఇకలేరు...

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (09:47 IST)
ఆకాశవాణి చిన్నమ్మ ఇకలేరు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతి రోజూ ప్రసారమయ్యే 'పాడి-పంట' కార్యక్రమంలో చిన్నమ్మగా శ్రోతలను పలుకరించిన నిర్మలా వసంత్ అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె... ఈ నెల 8వ తేదీన ఆకాశవాణి కేంద్రంలో జరిగిన పూర్వఉద్యోగుల ఆత్మీయసమ్మేళనంలో చివరిసారిగా పాల్గొన్నారు. తమిళనాడుకు చెందిన ఆమె కుటుంబం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కడప జిల్లాలో స్థిరపడ్డారు. 
 
హైదరాబాద్‌కు చెందిన వసంత్‌తో వివాహం జరిగిన అనంతరం ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. నిర్మల భర్త నిజాం కాలేజీలో ఇంగ్లీషు విభాగంలో పని చేశారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. పల్లెటూరి అమాయక మహిళా రైతుల సందేహాలను తన గొంతులో వినిపిస్తూ, పెద్దయ్య ద్వారా సమాధానాలు రాబడుతూ అందరినీ మెప్పించారు. వ్యవసాయ విభాగానికి కొండంత అండగా చిన్నమ్మ తన సేవలు అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments