Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రగొండపాలెంలో వైకాపా శ్రేణుల ఆందోళన.. చంద్రబాబుకు అదనపు భద్రత

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (18:07 IST)
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెంలో వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అదనపు భద్రత కల్పించారు. ఈ జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు వచ్చే మార్గంలో వైకాపా నేతలు ప్లకార్డులు, నల్లజెండాలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. 
 
గతంలో తెదేపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్‌ దళితులను కించపరిచేలా వ్యాఖ్యానించారని, దీనిపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైకాపా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే ఎర్రగొండ పాలెంలో అడుగుపెట్టనీయబోమని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 
 
దీనిని అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. వైకాపా కార్యకర్తల నిరసనలతో ఎన్‌ఎస్‌జీ అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రత కోసం అదనపు సిబ్బందిని రప్పించారు. ప్రస్తుతం మార్కాపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు..  ఎర్రగొండపాలెంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. అనంతరం ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ పేరిట నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments