Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు బాతులాంటి అమరావతి నిర్వీర్యం : సినీ నటి దివ్యవాణి

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (15:25 IST)
బంగారు బాతులాంటి అమరావతిని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి ఆరోపించింది. పైగా, ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ, బంగారుబాతు వంటి అమరావతిని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. అమరావతిని నాశనం చేయొద్దంటూ అసెంబ్లీలో రెండు చేతులు జోడించి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వేడుకున్నారని గుర్తుచేశారు.
 
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పంచాయతీ భవనాలకు వేసిన వైకాపా జెండా రంగుల నుంచి రాజధాని వరకు అన్ని నిర్ణయాలను కోర్టులు తప్పుపట్టాయని దివ్యవాణి ఎద్దేవా చేశారు. అమరావతి రైతులకు న్యాయస్థానాలే న్యాయం చేస్తాయని ఆమె తెలిపారు. స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో వాస్తవాలు బహిర్గతం చేయకుండా రమేశ్ బాబుపై కక్షసాధింపులు తగవని దివ్యవాణి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments