Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ కింగ్ మోహన్‌బాబును హౌస్ అరెస్ట్..

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (10:14 IST)
విద్యానికేతన్‌ విద్యార్థులకు 2014 నుంచి రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలేదని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫైర్ అయ్యారు. విద్యాభివృద్ధిపై ఏపీ సర్కార్‌కు చిత్తశుద్ధిలేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటింటికీ తిరిగి అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారని మోహన్‌బాబు ప్రశ్నించారు. 
 
తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఏ పార్టీ ప్రోత్సాహంతో తాను మాట్లాడటంలేదని మోహన్‌బాబు స్పష్టం చేశారు. దాదాపు రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంతకాలం ఇలా అంటూ అడిగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే.. ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ నటుడు మోహన్ బాబుకు గృహ నిర్బంధం విధించారు. 
 
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేస్తోందంటూ మోహన్ బాబు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత హోదాలో తిరుపతిలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇవాళ కుప్పంలో చంద్రబాబు నామినేషన్ కార్యక్రమం ఉండడంతో మోహన్ బాబు ర్యాలీ అవాంఛనీయ ఘటనలకు దారితీయొచ్చన్న ఉద్దేశంతో పోలీసులు ఈ ర్యాలీని అనుమతించడంలేదు. ఈ క్రమంలో మోహన్ బాబును బయటికి రానివ్వకుండా నివాసం చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments