Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేసి యువతిని పూడ్చేశాడు.. రెండుగంటల తరువాత బతికొచ్చిన యువతి..ఎలా..?

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (21:42 IST)
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం నిడమర్రులో దారుణం చోటు చేసుకుంది. కాలక్రుత్యాలు తీర్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చి పొలాల్లోకి వెళ్ళిన యువతిపై పాశవికంగా అత్యాచారం చేశాడు. అంతటితో ఆగలేదు తన బండారం ఎక్కడ బయటపడుతోందనని అతి దారుణంగా ఆమె గొంతుపై కాలేసి తొక్కేశాడు. ఊపిరి ఆడకుండా ఉండడంతో చనిపోయిందని భావించి బురదమట్టిలో పూడ్చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ యువతి రెండు గంటల తరువాత బయటపడి ఇంటికి చేరుకుంది.
 
నిడమర్రు దళితవాడకు చెందిన 18యేళ్ల యువతి కాలకృత్యాలు తీర్చుకునేందుకు తన ఇంటి సమీపంలోని పొలంలోకి వెళ్ళింది. బహిర్భూమికి యువతి వెళుతుండగా అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు ఆమెను చూశాడు. ఆమెను బలాత్కరించాడు. ఆమె ప్రతిఘటించింది. అయితే ఆమెను దారుణంగా కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయింది యువతి. 
 
దీంతో పాశవికంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన విషయం బయటపడుతోందనన్న భయంతో ఆమె మెడపై కాళ్లేసి తొక్కాడు. కొద్దిసేపటికి యువతి సైలెంట్‌గా ఉండడంతో చనిపోయిందనుకుని బురద మట్టి ఆమెపై వేసి కనిపించకుండా వెళ్ళిపోయాడు. రెండుగంటల సేపు తరువాత యువతికి స్పృ వచ్చింది. వెంటనే పైకి లేచి బురదను తోసుకుని ఇంటికి వెళ్ళింది యువతి. 
 
జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా రాజేష్ పరారయ్యాడు. రాజేష్ తల్లిదండ్రులను తీసుకొచ్చి పోలీసులు విచారించగా చివరకు అతను పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోయాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

నారా రోహిత్ బర్త్ డే స్పెషల్: 'సుందరకాండ' ఆగస్టు 27న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

వార్-2 ట్రైలర్ రిలీజ్- నువ్వా నేనా అని పోటీ పడుతున్న హృతిక్ రోషన్, ఎన్టీఆర్

ప్రపంచ సినిమా చరిత్రలోనే తొలిసారి - ఒకేరోజు 15 సినిమాలు ప్రారంభం!!

ఫిష్ వెంకట్ కుటుంబానికి నేనున్నా.. రూ.1.5 లక్షలు ఇచ్చిన సోనూ సూద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments