Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడు ఫోన్‌లో మాట్లాడటం లేదని యువతి ఆత్మహత్య

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (11:21 IST)
తన స్నేహితుడు తనతో మాట్లాడటం లేదని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా కలకడ మండల కేంద్రం ఇందిరమ్మ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీలో కాపురమున్న అంజనా దేవి కుమార్తె రంజిత(18) విజయవాడలో నీట్ పరీక్షకు కోచింగ్ తీసుకుంటోంది. 
 
కరోన వైరస్ ప్రభావంతో యువతి కొన్ని రోజుల క్రితం ఇంటికి చేరింది. ఈ క్రమంలో సహచర విద్యార్థితో ఫోన్లో తరచూ సంభాషించేది. గత 3 రోజులుగా సహచర విద్యార్థి ఫోన్లో సంభాషించకుండా ఆపివేయడంతో మనస్థాపానికి గురై ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
తల్లి అంజనాదేవి ఏఎన్ఎం విధులు ముగించుకుని ఇంటికి రాగానే తన కుమార్తె ఫ్యానుకు వేలాడుతూ కనపడటంతో కేకలు వేసింది. ఈ సంఘటనపై కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ ఐ.రవి ప్రకాష్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కగానొక్క కూతురు ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లి కన్నీటిపర్యంతమై విలపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments