Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో పురుగుల మందు తాగిన కుమారుడు, నీళ్ళనుకుని అదే మందును తాగిన తల్లి

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (18:00 IST)
వ్యసనాలకు బానిసై మద్యం మత్తులో ఉన్న కుమారుడు నీళ్ల సీసాలో పురుగుల మందు కలుపుకొని తాగి చనిపోయాడు. ఆ విషాద వార్త విన్న తల్లి.. దాహం వేస్తుండటంతో వెనుకాముందూ చూసుకోకుండా అదే సీసాలోని నీళ్లను తాగి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ములుగు మండలం పాల్‌సాబ్‌పల్లి గ్రామంలో జరిగింది. 
 
కాసర్ల రాజమల్లు.. కొమురమ్మ దంపతుల కుమారుడు రాజు మద్యం మత్తులో పురుగుల మందును కలుపుకుని తాగేశాడు. తండ్రి గమనించి ములుగు ఏరియా వైద్యశాలకు తరలించాడు. పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.
 
కూలీకి వెళ్లి  సాయంత్రం తిరిగొచ్చిన కొమురమ్మకు ఇరుగుపొరుగు విషయం చెప్పడంతో లబోదిబోమంటూ ఇంట్లోకి వెళ్లింది. ఆ పక్కనే ఉన్న సీసాలోని నీటిని తాగింది. తర్వాత వాసన వస్తుండటంతో పక్కనున్నవారికి చెప్పింది. ములుగు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఆమె మృతి చెందింది. గంటల వ్యవధిలో తల్లీకొడుకు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments