Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీషీటర్ హత్య.. కత్తితో పీక కోసి పరారైనారు.. గొడవలే కారణం..

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (10:00 IST)
విశాఖపట్టణంలో రౌడీషీటర్ హత్యకు గురైయ్యాడు. అతడి స్నేహితులే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే... విశాఖ అప్పుఘర్‌కు చెందిన బి.అనిల్‌కుమార్ (36), ఎంవీపీ కాలనీలోని ఆదర్శనగర్‌కు చెందిన శ్యామ్‌ప్రకాశ్ స్నేహితులు. 
 
అనిల్ కుమార్ రౌడీ షీటర్ కాగా.. శ్యామ్ ప్రకాశ్ బస్సు డ్రైవర్. ఈ ఇద్దరిపై కేసు వుంది. గతంలో ఒకసారి క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగింది. 
 
ఆ తర్వాత రాజీ కుదర్చడంతో మళ్లీ స్నేహితులయ్యారు. కానీ బార్‌లో మద్యం తాగుతూ ఏర్పడిన గొడవలో శ్యామ్ ప్రకాశ్ మరో స్నేహితుడితో కలిసి అనిల్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో అతడి పీక కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
 
కాగా, అనిల్ కుమార్ తనను తక్కువ చేసి హేళనగా మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకే శ్యామ్ ప్రకాశ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అతడిని హత్య చేసే ఉద్దేశంతోనే బార్‌కు తీసుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు శ్యామ్ ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మిగిలిన వారు పరారీలో వున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments