Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడికి హారతిస్తూ పూజారి కాలు జారి.. 100 అడుగుల నుంచి..?

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (15:13 IST)
Singanamala
అనంతపురం జిల్లా శింగనమలలో అపశృతి చోటుచేసుకుంది. దేవుడికి పూజలు చేస్తున్న సమయంలో పూజారి కాలు జారి లోయలో పడి మృతి చెందాడు. శ్రీ గంపమల్లయ్య స్వామికి శనివారం ఉదయం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పూజారి దేవుడికి హారతిస్తూ కాలు జారీ వంద అడుగులు ఉన్న కొండపై నుంచి కింద పడ్డాడు. దీంతో పూజారి అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
పూజారి మృతితో ఆలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. శ్రావణమాసం కావడంతో స్వామికి పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ పాపయ్య అనే వ్యక్తి.. స్వామికి వంశపారంపర్యంగా పూజలు చేస్తూ ఉంటారు. శనివారం కూడా యథావిధిగా పూజ చేస్తున్నారు.
 
ఈ క్రమంలో కొండ పైనుంచి గుహలోకి దిగే క్రమంలో ఒక్కసారిగా కాలు జారి లోయలో పడ్డాడు. భక్తులందరూ చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. ఊహించని ఈ ప్రమాదానికి అక్కడున్న భక్తులంతా షాక్ అయ్యారు. నిత్యం స్వామి పూజలో తరించే ఆ పూజారి.. అదే పూజలో ఉండగానే మృతి చెందడాన్ని భక్తులు జీర్ణించుకోలేకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments