Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడికి హారతిస్తూ పూజారి కాలు జారి.. 100 అడుగుల నుంచి..?

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (15:13 IST)
Singanamala
అనంతపురం జిల్లా శింగనమలలో అపశృతి చోటుచేసుకుంది. దేవుడికి పూజలు చేస్తున్న సమయంలో పూజారి కాలు జారి లోయలో పడి మృతి చెందాడు. శ్రీ గంపమల్లయ్య స్వామికి శనివారం ఉదయం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పూజారి దేవుడికి హారతిస్తూ కాలు జారీ వంద అడుగులు ఉన్న కొండపై నుంచి కింద పడ్డాడు. దీంతో పూజారి అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
పూజారి మృతితో ఆలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. శ్రావణమాసం కావడంతో స్వామికి పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ పాపయ్య అనే వ్యక్తి.. స్వామికి వంశపారంపర్యంగా పూజలు చేస్తూ ఉంటారు. శనివారం కూడా యథావిధిగా పూజ చేస్తున్నారు.
 
ఈ క్రమంలో కొండ పైనుంచి గుహలోకి దిగే క్రమంలో ఒక్కసారిగా కాలు జారి లోయలో పడ్డాడు. భక్తులందరూ చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. ఊహించని ఈ ప్రమాదానికి అక్కడున్న భక్తులంతా షాక్ అయ్యారు. నిత్యం స్వామి పూజలో తరించే ఆ పూజారి.. అదే పూజలో ఉండగానే మృతి చెందడాన్ని భక్తులు జీర్ణించుకోలేకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments