Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల ఘాట్‌లో తృటిలో తప్పిన ప్రమాదం.. లేకుంటే?

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (22:58 IST)
తిరుమల రెండవ ఘాట్ రోడ్డును ఉన్నట్లుండి టిటిడి మూసి వేయడానికి ప్రధాన కారణం ఉంది. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతోనే అందరూ అనుకున్నారు. కానీ పెద్ద బండరాయి ఒక్కసారిగా ఘాట్ రోడ్డుపైకి పడడంతో రోడ్డు మొత్తం చీలిపోయింది. అంతేకాదు ఆ ఫోర్స్‌కు రక్షణగా పెట్టిన ఇనుప కమ్మీలు కూడా కొట్టుకుపోయాయి. 

 
అది కూడా మోకాళ్ళమిట్టకు అతి సమీపంలో. తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఏడుగురు ప్రయాణీకులతో ఒక జీపు వెళుతోంది. ఉన్నట్లుండి పెద్ద శబ్ధంతో బండరాయి కిందకు పడింది. అదృష్టవశాత్తు జీపుపై అది పడలేదు. వెంట్రుకవాసి దూరంలో ప్రయాణీకులు తప్పించుకున్నారు.

 
జీపు కాస్త ముందుకు వెళ్ళిన వెంటనే రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. అయితే ఈ ఘటనలో భక్తులకు ఎవరికీ గాయాలు కాలేదు. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అంతేకాకుండా ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును కూడా ఆపేసి వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రస్తుతానికి మొదటి ఘాట్ రోడ్డులోనే వాహన రాకపోకలను కొనసాగిస్తున్నారు. 

 
రెండవ ఘాట్ రోడ్డును మరమ్మత్తులు చేయాలంటే ఖచ్చితంగా వారానికిపైగా సమయం పడుతుందని టిటిడి అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు పడి ఆగిన తరువాత కొండ చరియలు చెమ్మగిల్లి ఆ తరువాత కొండచరియలు విరిగిపడుతున్నాయని టిటిడి అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments