Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకుతో సెల్ఫీ తీసుకుంటూ వరద నీటిలో కొట్టుకుపోయిన తల్లి

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (20:03 IST)
మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు చిత్తూరు జిల్లాలో పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. కొడుకుతో పాటు ఫోటోలు తీసుకుందామని చిత్తూరు జిల్లాలో ఓ తల్లి వాగు వద్దకు వచ్చింది. ఫోటో తీసుకుంటుండగా ఒక్కసారిగా వరదనీరు ఉధృతి పెరిగింది. దీంతో ఇద్దరూ నీటిలో కొట్టుకుపోయారు. 
 
చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జల్లిపేట చెక్ డ్యాం వద్ద నీటిప్రవాహం ఎక్కువగా ఉందని గడ్డూరు కాలనీకి చెందిన మౌలా భార్య పర్వీన్ తెలుసుకుంది. గ్రామస్తులందరూ వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారని కొడుకుని వెంట పెట్టుకుని వెళ్ళింది.
 
వాగులో దిగి ఎనిమిదేళ్ళ కొడుకు హమీద్‌తో కలిసి ఫోటోలు తీసుకుంటూ ఉంది. అయితే ఉన్నట్లుండి వరద ఉధృతి పెరగడంతో కొడుకుతో పాటు ఆమె వరద నీటిలో కొట్టుకుపోయింది. సుమారు మూడుగంటల పాటు రెస్య్కూ టీం గాలించి తల్లి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇంకా కుమారుడి ఆచూకీ తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments