Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు గొడవ, స్నేహితుడికి హల్వా పెట్టి హత్య, విజయవాడలో దారుణం

ఐవీఆర్
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (18:33 IST)
డబ్బు. ఈ డబ్బు ఎంత మేలు చేస్తుందో అంతకంటే కొన్నిసార్లు కీడు కూడా చేస్తుంటుంది. డబ్బు దగ్గర ఇద్దరి స్నేహితుల మధ్య తలెత్తిన మనస్పర్థలు కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ దారుణం విజయవాడలోని రామవరప్పాడులో చోటుచేసుకుంది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. 53 ఏళ్ల రామకృష్ణకి అతడి స్నేహితుడికి మధ్య డబ్బు లావాదేవీల విషయంలో స్వల్ప గొడవలున్నాయి. ఐతే అవి ప్రాణాలు తీసేంతగా వుంటాయని అతడు ఊహించలేదు. శనివారం నాడు యథాప్రకారం స్నేహితుడిని కలిసేందుకు వెళ్లాడు. డబ్బు గురించి కొద్దిసేపు మాట్లాడుకున్నాక రామకృష్ణకి అతడి స్నేహితుడు చిన్న హల్వా ముక్క ఇచ్చి తినమన్నాడు.
 
ఆ ముక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే అతడికి తీవ్ర అస్వస్థత కలిగింది. వెంటనే భార్య ఏమైందని అడగ్గా... హల్వా తిన్న దగ్గర నుంచి తనకు ఏదోలా వుందని అన్నాడు. దాంతో అతడిని వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐతే అతడికి చికిత్స అందిస్తుండగానే రక్తపోటు తీవ్రస్థాయికి చేరుకుని మరణించాడు. హల్వాలో ఏదయినా కలిపి ఇవ్వడం వల్లనే రామకృష్ణ చనిపోయి వుంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక అసలు విషయం బయటపడుతుందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments