Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో కోడలిని చంపేసిన మామ

Webdunia
మంగళవారం, 3 మే 2016 (16:23 IST)
పుట్టింటి తరువాత ఆడబిడ్డకు మెట్టిల్లే ఆలయమంటారు పెద్దలు. మెట్టినింటిలోని అత్త, మామలే కన్నతల్లిదండ్రులతో సమానమంటారు. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం సమాజంలో కొన్ని సంఘనలు జరుగుతున్నాయి. కన్నబిడ్డలా చూసుకోవాల్సిన కోడలిని దారుణంగా కొట్టి చంపాడో మామ. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.
 
పుంగనూరు భగత్‌సింగ్‌ కాలనీలో భాగ్యమ్మ, రాజశేఖర్‌లు నివాసముంటున్నారు. వీరితో పాటు రాజశేఖర్‌ మామ హరి కూడా ఉంటున్నారు. ఇంట్లో తరచూ మామ హరి కోడలికి పనిచెప్పేవారు. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో గొడవలు జరుగుతుండేవి. మంగళవారం కూడా టిఫిన్‌ విషయంలో కోడలు, మామకు మధ్యకు గొడవ జరగడంతో ఆమె తీవ్రంగా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. 
 
అంతటితో ఆగకుండా ఆమెను ఇంటిలోనే ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులను నమ్మబలికే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు మాత్రం మామే కోడలిని చంపేశాడని ఫిర్యాదు చేశారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments