సెల్ ఫోన్ దొంగిలించాడని కరెంట్ షాక్ ఇచ్చి, అగ్గిపుల్లలతో బాలుడిని కాల్చి చంపారు

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (21:06 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. 13 సంవత్సరాల భరత్ అనే బాలుడు సెల్ ఫోన్‌ను దొంగిలించి విక్రయించేశాడు. దీంతో కోపంతో ఆ బాలుడికి విద్యుత్ షాక్ ఇచ్చారు. అంతటితో ఆగలేదు. విద్యుత్ షాక్‌కు తేరుకుని పైకి లేస్తున్న బాలుడిని అగ్గిపుల్లలతో శరీరంపై కాల్చారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాలుడు మృతి చెందాడు.
 
మదనపల్లె యాదవ వీధిలో నివాసముండే బన్నీ తన పెద్దనాన్న సెల్ ఫోన్‌ను దొంగిలించి తను అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ చాంద్ బాషాకు సెల్ ఫోన్‌ను విక్రయించాడు. విషయం కాస్త పెద్దనాన్నకు తెలిసింది. దీంతో భరత్‌ను ఇంటి మిద్దెపైకి తీసుకెళ్ళి ఖాళీగా ఉన్న గదిలో కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చారు.
 
భరత్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మధ్యాహ్నం తేరుకున్నాడు. మళ్ళీ అతడిని అగ్గిపుల్లలతో శరీరంపై కాల్చారు. దీంతో భరత్ స్పృహ తప్పి పడిపోయాడు. భరత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే చనిపోయాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆడుతూపాడుతూ ఉన్న బాలుడు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments