Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని భార్యను గెంటేసి పరారైన భర్త-అత్త

Webdunia
బుధవారం, 8 మే 2019 (18:58 IST)
ఆధునిక సమాజంలోను కొడుకు, కూతురు తేడా చూపిస్తున్నారు కొందరు. కుమారుడైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కుమార్తె అయితే డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అనుకుంటున్నారు కొంతమంది. అలాంటి కోవకు చెందిన వ్యక్తి ఉదంతం బయటపడింది. కర్నూలు జిల్లా స్వామిరెడ్డినగర్‌కు చెందిన అబ్ధుల్ మాజిత్ అనే వ్యక్తి తన భార్యకు ఆడపిల్లలే పుడుతున్నారనే కోపంతో భార్యను ఇంటి నుంచి బయటకు తరిమేశాడు.
 
అబ్ధుల్ మాజిత్, గౌసియాలకు మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. మొదటి సంతానం ఆడపిల్ల. రెండవ సంతానం కూడా ఆడపిల్లే. దీంతో గత 7 నెలల నుంచి భార్య గౌసియాను అబ్ధుల్ మాజిత్, అత్త నిలోఫర్‌లు వేధిస్తూ వచ్చారు. అత్తతో పాటు భర్త పెట్టిన బాధలను తట్టుకుంది గౌసియా. అయితే గత రెండురోజుల ముందు ఇద్దరూ చిత్రహింసలకు గురిచేసి గౌసియాను ఇంటి నుంచి పిల్లలతో సహా బయటకు గెంటేశారు. 
 
ఆ తరువాత ఇంటికి తాళాలు వేసి ఇద్దరూ కనబడకుండా ఎటో వెళ్లిపోయారు. దీంతో గౌసియా తనకు న్యాయం కావాలంటూ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అబ్ధుల్ మాజిత్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో పాటు బంధువుల ఇళ్ళలో ఎక్కడా లేకపోవడంతో పోలీసులు అతనితో పాటు నిలోఫర్ కోసం వెతుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments