Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఓబీలో మళ్లీ కాల్పుల మోత

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (05:44 IST)
ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మరోసారి తుపాకీ చప్పుడైంది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నిన్న ముగ్గురు మావోలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో.. ఇవాళ మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి.

విశాఖ జిల్లా గూడెంకొత్త వీధి మండలం గుమ్మిరేవుల వద్ద మరోసారి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అటవీప్రాంతంలో దాదాపు 20 నిమిషాలపాటు తుపాకుల శబ్దాలు వినిపించాయి. నిన్నటి ఎదురుకాల్పుల్లో ముగ్గురు మవోలు మృతి చెందారు. మరి కొందరు అడవిలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసు బలగాలకు.. మావోయిస్టులు తారసపడిన సందర్భంలో.. మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మరికొంతమంది మావోయిస్టులు గాయపడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కొన్ని ఆయుధాలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిన్న మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు అటవీ ప్రాంతం నుంచి రహదారి మార్గానికి తీసుకువచ్చారు. వారిని చత్తీస్​గఢ్​కు చెందిన అజయ్, బుద్రి, బిమ లుగా గుర్తించారు. ఈ మృతదేహాలకు నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments