Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి...

Webdunia
బుధవారం, 12 జూన్ 2019 (10:38 IST)
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పనపాకంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక స్నానం చేస్తుండగా ఆ దృశ్యాలను చిత్రీకరించి లైంగింక దాడికి పాల్పడ్డారు నలుగురు యువకులు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 
 
వివరాలు పరిశీలిస్తే పనపాకం గ్రామానికి చెందిన సరిత ( పేరు మార్చాం) చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో సరిత సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. స్కూల్‌కి సెలవులు కావడంతో పనపాకంలో నాయనమ్మ ఇంటికి వచ్చింది. సరిత స్నానం చేస్తుండగా మోహన్ అనే మైనర్ బాలుడు తన సెల్‌ఫోన్‌తో  వీడియో తీసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
అంతేకాదు మోహన్ తన నలుగురు స్నేహితులకు ఆమె ఫోటోలను షేర్ చేశాడు. వీటిని చూసిన ఆ యువకులు ఈ బాలికను లైంగికంగా వేధించారు. తమకు సహరించకపోతే ఫేస్ బుక్‌లో పెడతామని బెదిరించారు. వారి వేధింపులు తాళలేక ఆమె ఉరి వేసుకొని చనిపోవాలని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇరుగుపొరుగువారు గమనించి సరైన సమయంలో ఆమెను కాపాడటంతో ప్రాణాలతో బయటపడింది. కాగా ఈ దారుణానికి ఒడిగట్టిన ఐదుగురు యువకులను అరెస్టు చేసిన ఖాకీలు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం