Webdunia - Bharat's app for daily news and videos

Install App

హామీలలో 90 శాతం అమలు: మంత్రి అనిల్

Webdunia
బుధవారం, 22 జులై 2020 (20:50 IST)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మొక్కలు నాటే కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు, సిబ్బంది భాగస్వామ్యం కావాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
 
విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో వనమహోత్సవం  భాగంగా గవర్నర్‌పేట్‌లోని బుధవారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ఆయా కాలనిలలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని సీఎం ఈ రోజు స్వీకారం చేశారన్నారు. సీఎం స్పూర్తితో మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని కోరారు. 
 
ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ  ఎమ్మెల్యే పి. రామ కృష్ణారెడ్డి, అధికారులు  సి నారాయణ రెడ్డి, ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఇరిగేషన్), కె.నరసింహమూర్తి, ఇరిగేషన్  సూపరింటెండింగ్ ఇంజనీర్, ఇరిగేషన్ సర్కిల్ విజయవాడ, పిపిఎంయు, సూపరింటెండింగ్ ఇంజనీర్,  ఎ.రాజా స్వరూప్ కుమార్, కెసి డివిజన్, విజెఎ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,  ఎ రాజా స్వరూప్ కుమార్  తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments