ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్.. ఏపీ వ్యాప్తంగా 9 మంది విద్యార్థులు సూసైడ్

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (08:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 63 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఈ పరీక్షల్లో కష్టపడి చదివి, ఎంతో బాగా రాసిన విద్యార్థులు సైతం ఫెయిల్ అయ్యారు. ఇలాంటి పలువురు తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొమ్మిది మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. 
 
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందిన అనూష (17) ఇంటర్ ఫెయిల్ కావడంతో గురువారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. సెలవుల కోసం కర్నాటకలోని అమ్మమ్మ ఊరికి వెళ్లిన ఆమె ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. దీంతో ఆమె అక్కడే ఈ దారుణానికి ఒడిగట్టింది. 
 
ఇకపోతే, చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లికి చెందిన బాబు (17) అనే విద్యార్థి గణితంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో పరీక్షా ఫలితాలు విడుదలైన బుధవారం రాత్రే పురుగుల మందు సేవించి సూసైడ్ చేసుకున్నాడు. అలాగే, తనకు తక్కువ మార్కులు వచ్చాయన్న మనస్థాపనంతో తులసీ కిరణ్ (17) అనే విద్యార్థి గురువారం ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
ఇకపోతే, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్ (17) అనే విద్యార్థి టెక్కలి గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి చనిపోయాడు. అలాగే, విశాఖపట్టణానికి చెందిన ఆత్మకూరు అఖిల శ్రీ (16), బోనెల జగదీశ్ (18), అనంతపురం జిల్లా కణేకల్లు మండలం, హనకనహాళ్ గ్రామానికి చెందిన మహేశ్ (17), ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన షేక్ జాన్ సైదా (16), అదే జిల్లాకు చెదిన రమణ రాఘవ (17)లు ఆత్మహత్య చేసుకున్నవారిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

Nagarjuna: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రెండు కోట్ల స్కాలర్‌షిప్ ప్రకటించిన నాగార్జున

B. Nagi Reddy: బి.నాగిరెడ్డి జీవితమే ఓ గొప్ప వ్యక్తిత్వ వికాస గ్రంథం.

Sreeleela: ఏఐ-జనరేటెడ్ నాన్సెన్స్‌కు మద్దతు ఇవ్వవద్దు.. శ్రీలీల

Naresh Agastya: సముద్రంలో 3 నిమిషాల 40 సెకండ్స్ 80 ఫీట్స్ డెప్త్ వెళ్లా : నరేష్ అగస్త్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments