Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదలకు 664 కోట్ల రూపాయల నష్టం: కలెక్టర్ ఇంతియాజ్

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (22:43 IST)
విజయవాడలో కురుసిన భారీ వర్షాలకు, వరదలకు  664 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టరు ఏఎండి ఇంతియాజ్ కేంద్ర బృందం సభ్యులకు  వివరించారు. అందులో  ప్రధానంగా పండ్ల తోటలకు రూ. 290 కోట్లు, వ్యవసాయానికి రూ. 138 కోట్లు,ఆర్ అండ్ బీకి రహదారులకు రూ.197 కోట్లు, నీటిపారుదల శాఖకు రూ.143కోట్లు రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు.     

సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన  పంటలు, రహదారులు, ఇతర నష్టాలపై  ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను కలెక్టరు ఏఎండి ఇంతియాజ్  వరద నష్టంపై అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృంద సభ్యులు జాయింట్ సెక్రటరీ సౌరవ్ రాయ్ కు పూర్తి స్థాయిలో వివరించారు. 

ఈ బృందంలో జాయింట్ సెక్రటరీ సౌరవ్ రాయ్ తో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి అసిస్టెంట్ కమీషనర్ ఆయుష్ పునియ, నేషనల్ హైవేస్ స్పెషల్ కమీషనర్ శ్రవణ్ కుమార్ సింగ్ లు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాల వల్ల 93 రోజుల పాటు నిరంతరం ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు అధిక స్థాయిలో వచ్చి చేరిందన్నారు.

ప్రకాశం బ్యారేజ్ ద్వారా సుమారు 1005 టీఎంసీల నీటిని సముద్రంలో వదిలామన్నారు. కృష్ణానదికి అధికంగా 8 లక్షల క్యూ సెక్కుల వరద నీరు చేరిందన్నారు. రెండవ ప్రమాద హెచ్చరికకు 6 లక్షల క్యూసెక్కులుగా ఉన్నప్పటికీ 8 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో ఆందోళన చెందామన్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో వున్న 18 మండలాలతో పాటు జిల్లాలోని మరో 15 మండలాలు కూడా భారీవర్షాలకు నష్టపోయాయన్నారు.

ఈ వరదల్లో ఇళ్లు కూలి ఒకరు, నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి మరొకరు మరణించారన్నారు. జిల్లాలో పంట నష్టాల పై వివరిస్తూ వరి, ప్రత్తి, కంది, మినుములు, పెసర వంటి పప్పుధాన్యాలతో పాటు మొక్కజొన్న, వేర శెనగ వంటి మెట్ట ప్రాంతాల్లో కూడా సుమారు 11 వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ కూడా మంజూరు చేసిందన్నారు.

అలాగే పండ్ల తోటల్లోని  పొలాల్లో నీరు వారం రోజులపాటు నిలబడి పోవడంతో వాణిజ్య పంటలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. జిల్లాలో అరటి, బొప్పాయి సాగు చేసే వాణిజ్య పంటలకు ఎక్కువ మొత్తంలో నష్టం జరిగిందని, పొలాలకు 3.51 కోట్ల రూపాయల ఇన్ పుట్ సబ్సిడీని కూడా ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. వీటితో పాటుగా అక్టోబర్ నెలలో సంభవించిన వరద నష్టానికి సుమారు 20 కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉందని కలెక్టర్ వివరించారు.

జిల్లాలో మత్స్యశాఖలో జరిగిన నష్టాలను వివరిస్తూ జిల్లాలో 475 ముత్స్యకార బోట్లు, వలలు నష్టపోయాయన్నారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్లు కూడా గోతులు పడ్డాయని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో రూ.264 లక్షల రూపాయలతో తాత్కాలికంగా రిపేర్లు చేయవచ్చని అలాగే 50 కోట్ల రూపాయలతో శాశ్వతంగా మరమ్మతులు చేయడానికి అవకాశం ఉందని అంచనాకు వచ్చానని బృందానికి వివరించారు.

అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు. ఇరిగేషన్ శాఖ కూడా 30 కోట్ల రూపాయలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టాల్సి ఉందన్న అంచనా విడుదల చేశారన్నారు. ప్రస్తుత వరదలు వచ్చిన సందర్భంలో 10 వేల మంది నిరాశ్రయలను ఆదుకున్నామని, వారికి రిలీఫ్ క్యాంపులు పెట్టి ఉచిత భోజన సదుపాయాలు కూడా కల్పించానున్నారు.

జిల్లాలో మొత్తం 45 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశామని, సుమారు 3 వేల మందికి 500 రూపాయల చొప్పున పరిహారం కూడా అందజేశామన్నారు. జిల్లాలో 24,075 మంది వరద బాధితులకు 25 కేజీల ఉచితంగా బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లి, బంగాళదుంపలు, ఒక లీటరు పామోలిన్ ఆయిల్ కూడా ఇచ్చామన్నారు. జిల్లాలో పశుసంవర్థకశాఖ, సెరీ కల్చర్, గృహాలు తదితర శాఖలకు సంబంధించి కూడా నష్టాలు వాటిల్లినాయని కలెక్టర్  కేంద్ర బందానికి వివరించారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు డా. కె.మాధవీలత, శివశంకర్ మోహన్ కుమార్ డిఆర్వో వెంకటేశ్వర్లు, ముఖ్య ప్రణాళికాధికారిశర్మ, వ్యవసాయశాఖ జేడి మోహన్ రావు, మత్స్యశాఖ జేడి లాల్ మహ్మద్, పశుసంవర్ధకశాఖ జేడి, హార్టీకల్చర్ డీడీ, పంచాయతీరాజ్ ఎస్ఇ ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments