Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలతో ఉన్న వృద్ధురాలిని పీక్కుతిన్న వీధి కుక్కలు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 30 జనవరి 2019 (17:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఒళ్లు జలదరించే ఘటన ఒకటి జరిగింది. ప్రాణాలతో ఉన్న ఓ వృద్ధురాలిని వీధి కుక్కలు సజీవంగా పీక్కుతిన్నాయి. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీహరిపురం గ్రామంలో జరిగింది. 
 
బుధవారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన అంపిల్లి రాముడమ్మ అనే 65 యేళ్ళ వృద్ధురాలు మంగళవారం రాత్రి తన ఇంటి గడపలోనే నిద్రించింది. రాత్రి సమయంలో అటుగా వచ్చిన వీధి కుక్కల గుంపు... నిద్రపోతున్న రాముడమ్మపై ఒక్కసారిగా దాడిచేశాయి. నిద్రమత్తులో ఉన్న ఆమె.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు.. కుక్కలన్నీ కలిసి ఆమెను వీధిలోకి ఈడ్చుకొచ్చాయి. 
 
ఆ తర్వాత కుక్కలన్నీ కలిసి ఆమె శరీరాన్ని పీక్కుతిన్నాయి. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. వీధి కుక్కల స్వైరవిహారంతో గ్రామ ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments