Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రాజధాని ఉద్యమానికి 600 రోజు

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (10:25 IST)
అమరావతి రాజధాని ఉద్యమానికి 600వ రోజుకు చేరుకుంది. ఉద్యమ కార్యాచరణను అమరావతి జేఏసీ రాజధానిని ప్రకటించింది. ఆదివారం ఉదయం 9 గంటలకు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో బైక్ ర్యాలీ జరగనుంది. 
 
హైకోర్టు దగ్గర ఉన్న జడ్జి క్వార్టర్ల నుంచి బైక్ ర్యాలీ ప్రారంభం కానుంది. మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు ర్యాలీ జరగనుంది. మార్గమధ్యలో చర్చి, మసీదులను సైతం రైతులు సందర్శించనున్నారు. 
 
మరోవైపు, అమరావతి పోరాటం 600 రోజులైనా ఆగలేదని, రైతులు, మహిళల పోరాటస్ఫూర్తి తెలుగు జాతి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 
 
అమరావతి రైతులు ఇచ్చిన భూముల్లో కట్టిన సచివాలయం, శాసనసభల్లోనే ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ పెద్దలంతా కూర్చుని పనిచేస్తున్నారని, అదే భూముల్లో కట్టిన హైకోర్టు చుట్టూ రోజూ తిరుగుతూ ఆ రైతుల మొ హం చూడటానికి మాత్రం ఇష్టపడటం లేదని విమర్శించారు.
 
రైతుల పోరాటాన్ని అణచివేయడానికి, అమరావతి రాజధానిని నాశనం చేయడానికి వైసీపీ ప్రభుత్వం అనేక దారుణాలకు పాల్పడిందంటూ వివరించారు. చివరకు రాజధానిలో నిర్మించిన రోడ్లను కూడా తమ పార్టీ వారితో తవ్వించి కంకర, ఇసుక అమ్ముకొనే దుస్థితికి ప్రభుత్వ పెద్దలు దిగజారారన్నారు. 
 
అమరావతి నాశనం వల్ల ఎక్కువ నష్టపోయింది దళితులేనని తెలిపారు. అమాయక మొహం పెట్టుకొని తిరిగే జగన్‌రెడ్డి లోపల పెద్ద శా డిస్టు ఉన్నారని, ఆయన క్రూరత్వం అమరావతి నాశనంలో కనిపిస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments