Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురి దుర్మరణం

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (09:20 IST)
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. రాజమండ్రిలోని ప్రకాశ్ నగర్‌కు చెందిన ఎనిమిది మంది తమ సొంతకారులో హైదరాబాద్ నుంచి సొంతూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో కారు జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి శివారుకు చేరుకుని తర్వాత అదుపుతప్పి ఆగివున్న లారీని ఢీకొట్టింది. 
 
ఈ ఘటనలో కారులోని ఎనిమిది మందిలో ఆరుగురు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉంది. గాయపడిన ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments