Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు: ఐదుగురు సజీవ దహనం.. రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (13:07 IST)
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి ఆటోపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ముగ్గురు మాత్రం ఆటోలో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.  
 
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి దగ్గర విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 
 
ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని.. మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పారిస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలను సీఎంవో అధికారులు తెలియజేశారు.
 
మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణం నివేదిక అందించాల్సిందిగా అనంతపురం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను ఆదేశించినట్లు ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు అన్నారు. 
 
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎస్ఈని ఆదేశించామన్నారు. హై టెన్షన్ విద్యుత్ లైన్‌పై ఉడుత పడిన కారణంగానే విద్యుత్ తీగ తెగిపోయిందన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments