Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు: ఐదుగురు సజీవ దహనం.. రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
గురువారం, 30 జూన్ 2022 (13:07 IST)
శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి ఆటోపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ముగ్గురు మాత్రం ఆటోలో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.  
 
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి దగ్గర విద్యుత్‌ వైర్లు తాకి ఆటో ప్రమాదానికి గురైన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 
 
ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని.. మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పారిస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి ఘటన వివరాలను సీఎంవో అధికారులు తెలియజేశారు.
 
మరోవైపు ఈ ఘటనపై విచారణ జరిపి తక్షణం నివేదిక అందించాల్సిందిగా అనంతపురం సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్‌ను ఆదేశించినట్లు ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు అన్నారు. 
 
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం ఎస్ఈని ఆదేశించామన్నారు. హై టెన్షన్ విద్యుత్ లైన్‌పై ఉడుత పడిన కారణంగానే విద్యుత్ తీగ తెగిపోయిందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు సుకృతి జీవితంలో మంచి జ్ఞాపకం: దర్శకుడు సుకుమార్‌

Pupshp 2 Reloaded: పుష్ప 2 రీలోడెడ్ కు కారణం సోషల్ మీడియానే కారణమా?

'సంక్రాంతికి వస్తున్నాం' - 3 రోజుల్లోనే రూ.106 కోట్లు వసూళ్లు!!

సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లు: ప్రధాన నిందితుడు అరెస్ట్?

బక్కోడికి రజిని బండోడికి బాలయ్య - తమన్ డైలాగ్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments