Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్‌లో ఒంటరిగా వున్న మహిళ హత్య.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

సెల్వి
మంగళవారం, 1 అక్టోబరు 2024 (12:19 IST)
బెంగళూరులో ఓ మహిళ హత్యకు గురై.. ఆమె మృతదేహ అవశేషాలు ఫ్రిడ్జ్‌లో వున్న ఘటన సంచలనం సృష్టించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఓ మహిళ తన ఇంట హత్య గురైంది. 
 
వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో సోమవారం అర్థరాత్రి ఓ మహిళ హత్యకు గురైంది. మృతురాలిని జూబ్లీహిల్స్‌లోని నవోదయ కాలనీకి చెందిన సుధారాణి (44)గా గుర్తించారు. 
 
మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధాలతో మహిళను హత్య చేశారు. మహిళ భర్త, ఆర్‌ఎంపీ తన క్లినిక్‌లో ఉండగా, వారి ఇద్దరు పిల్లలు ట్యూషన్ క్లాసులకు వెళ్లేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
 
ట్యూషన్‌ క్లాసుల నుంచి వచ్చిన పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని గమనించి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments