Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్‌లో ఒంటరిగా వున్న మహిళ హత్య.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

సెల్వి
మంగళవారం, 1 అక్టోబరు 2024 (12:19 IST)
బెంగళూరులో ఓ మహిళ హత్యకు గురై.. ఆమె మృతదేహ అవశేషాలు ఫ్రిడ్జ్‌లో వున్న ఘటన సంచలనం సృష్టించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఓ మహిళ తన ఇంట హత్య గురైంది. 
 
వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో సోమవారం అర్థరాత్రి ఓ మహిళ హత్యకు గురైంది. మృతురాలిని జూబ్లీహిల్స్‌లోని నవోదయ కాలనీకి చెందిన సుధారాణి (44)గా గుర్తించారు. 
 
మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధాలతో మహిళను హత్య చేశారు. మహిళ భర్త, ఆర్‌ఎంపీ తన క్లినిక్‌లో ఉండగా, వారి ఇద్దరు పిల్లలు ట్యూషన్ క్లాసులకు వెళ్లేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
 
ట్యూషన్‌ క్లాసుల నుంచి వచ్చిన పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని గమనించి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments