Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు దాఖలు

సెల్వి
బుధవారం, 24 ఏప్రియల్ 2024 (12:35 IST)
నెల్లూరు జిల్లాలో మంగళవారం నాటికి 41 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు 36, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన వారిలో నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆయన సతీమణి సునందారెడ్డి, నెల్లూరు నగర నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థి మూలం రమేష్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. 
 
నెల్లూరు రూరల్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి పొంగూరు నారాయణ భార్య పొంగూరు రమాదేవి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. 
 
ఆదాల ప్రభాకర రెడ్డి, పొంగూరు నారాయణ ఇద్దరూ తమ తమ నియోజకవర్గాల్లో సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నికలకు మరో 20 రోజుల సమయం ఉండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments