Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై మాజీ సైనికోద్యోగుడి అత్యాచారం...

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (10:17 IST)
అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై కామంతో కళ్లుమూసుకున్న ఓ మాజీ సైనికోద్యోగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను హత్య చేసి మూటగట్టి ఇంట్లోనే పడేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలావున్నాయి. 
 
చెన్నై నగర శివారు ప్రాంతమైన తిరుముళ్లైవాయల్‌కు చెందిన ఓ మహిళ గురువారం సాయంత్రం తన నాలుగేళ్ల కుమార్తెను ఇంట్లోనే ఉంచి కుమారుడిని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లింది. అయితే, తిరిగి వచ్చిన ఆమెకు కుమార్తె కనిపించకపోవడంతో ఇల్లంతా గాలించింది. ఇరుగుపొరుగువారి వద్ద కూడా ఆరా తీసింది. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.
 
ఫిర్యాదు చేసి ఇంటికి వచ్చిన ఆమె మరోమారు ఇల్లంతా వెతికింది. ఈ క్రమంలో బాత్రూంలో ఓ గోనె సంచి కనిపించడంతో విప్పి చూసిన ఆమె షాక్‌కు గురైంది. అందులో తన కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. 
 
ఆ తర్వాత సమాచారాన్ని పోలీసులకు చేరవేసింది. బాధితురాలి ఇంటి సమీపంలో ఉంటున్న ఆమె బంధువు, మాజీ సైనికోద్యోగి అయిన వ్యక్తిని అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments