Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 2 వేల నోట్లు ఇస్తే రెట్టింపు చేస్తామంటూ బురిడీ...

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (21:47 IST)
రూ. 2 వేలు నోట్లు ఇస్తే రెండు రోజుల్లో రెట్టింపు చేస్తామని ఓ వ్యక్తిని బురిడీ కొట్టించిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేసారు. యాదగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురంలో ఐలయ్య అనే వ్యక్తి నుంచి గుంటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు రూ.12 లక్షలు వసూలు చేసారు. ఈ నగదును ఈనెల 21వ తేదీన తీసుకున్నారు. ఈ డబ్బు మొత్తాన్నీ సంచిలో ఉంచితే రెండు రోజుల్లో రెట్టింపు అవుతాయని నమ్మించారు. రూ. 2 వేల నోట్లు ఇస్తే రెట్టింపు చేస్తామంటూ బురిడీ...
 
అయితే నిందితులు ఐలయ్యను మోసం చేసారు. ఆ సంచిలో తెల్ల కాగితాలు ఉంచి, నగదును పట్టుకెళ్లిపోయారు. బాధితుడు రెండు రోజుల తర్వాత సంచి తెరిచి చూసి ఒక్కసారిగా అవ్వాక్కయ్యాడు. అందులో ఉన్న తెల్ల కాగితాలను చూసి ఐలయ్య షాక్‌కు గురైయ్యాడు. తాను మోసపోయాడని గ్రహించిన ఐలయ్య పోలీసులను ఆశ్రయించాడు. 
 
గుంటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు తనను మోసం చేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షేక్‌ నైదా అనే నిందితుడిని అరెస్టు చేసారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడైన నైదా నుండి పోలీసులు రూ.12 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments