Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 2 వేల నోట్లు ఇస్తే రెట్టింపు చేస్తామంటూ బురిడీ...

Webdunia
శుక్రవారం, 28 జూన్ 2019 (21:47 IST)
రూ. 2 వేలు నోట్లు ఇస్తే రెండు రోజుల్లో రెట్టింపు చేస్తామని ఓ వ్యక్తిని బురిడీ కొట్టించిన మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేసారు. యాదగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురంలో ఐలయ్య అనే వ్యక్తి నుంచి గుంటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు రూ.12 లక్షలు వసూలు చేసారు. ఈ నగదును ఈనెల 21వ తేదీన తీసుకున్నారు. ఈ డబ్బు మొత్తాన్నీ సంచిలో ఉంచితే రెండు రోజుల్లో రెట్టింపు అవుతాయని నమ్మించారు. రూ. 2 వేల నోట్లు ఇస్తే రెట్టింపు చేస్తామంటూ బురిడీ...
 
అయితే నిందితులు ఐలయ్యను మోసం చేసారు. ఆ సంచిలో తెల్ల కాగితాలు ఉంచి, నగదును పట్టుకెళ్లిపోయారు. బాధితుడు రెండు రోజుల తర్వాత సంచి తెరిచి చూసి ఒక్కసారిగా అవ్వాక్కయ్యాడు. అందులో ఉన్న తెల్ల కాగితాలను చూసి ఐలయ్య షాక్‌కు గురైయ్యాడు. తాను మోసపోయాడని గ్రహించిన ఐలయ్య పోలీసులను ఆశ్రయించాడు. 
 
గుంటూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు తనను మోసం చేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. షేక్‌ నైదా అనే నిందితుడిని అరెస్టు చేసారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడైన నైదా నుండి పోలీసులు రూ.12 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments