Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ శాపం.. 4నెలల పసికందుకు కరోనా పాజిటివ్

Webdunia
మంగళవారం, 26 మే 2020 (16:55 IST)
కరోనా మహమ్మారి పేదల పాలిట శాపంగా మారింది. పొట్ట కూటి కోసం పక్క రాష్ట్రాలకు వలస పోయిన కార్మికులు లాక్ డౌన్‌తో నానా తంటాలు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు పనులు లేక స్వస్థలాలకు తరలివస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నారాయణ పేట జిల్లాలో నాలుగు నెలల పసికందుకు కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టించింది. 
 
రెండు రోజుల క్రితం ముంబై నుంచి జాక్లైర్‌కు వచ్చిన వలస కూలీ, అతని కుమారుడికి పరీక్షలు నిర్వహించగా బాలునికి కరోనా పాజిటివ్‌గా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్యం కోసం వారిని హైదరాబాద్ గాంధీ దవాఖానకు తరలించారు.
 
మరోవైపు నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం ఏపూరు గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం రోజుల క్రితం ముంబై నుంచి వలస వచ్చిన 60 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో అతనిని మూడు రోజుల క్రితం జిల్లా దవాఖానకు తరలించారు. 
 
అక్కడి నుంచి హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించగా మంగళవారం అతనికి పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చారు. ఇతనితో పాటు ముంబై నుంచి మరో ఐదుగురు ఒకే కారులో ప్రయాణం చేసి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. వారికి కూడా పరీక్షలు జరిపి పాజిటివ్ రాకుంటే హోం క్వారంటైన్ లో ఉంచుతామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments