Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలులో కోవిడ్‌ పాజిటివ్‌.. మూడుకు చేరిన కేసులు

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (19:22 IST)
ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం కోవిడ్‌ పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో పట్టణంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య మూడుకు చేరింది. ఒంగోలులోని లంబాడి డొంకకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వచ్చినట్లు జిజిహెచ్ ఒంగోలు సూపరింటెండెంట్ డాక్టర్ ఎం భగవాన్ నాయక్, సిఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ బి తిరుమలరావు తెలిపారు. 
 
RT-PCR పరీక్ష కోసం ఆదివారం అతని నమూనాను సేకరించారు. సోమవారం ల్యాబ్ ద్వారా ప్రకటించడం జరిగింది. కరోనా సోకిన వ్యక్తిని ఆసుపత్రిలోని కోవిడ్ స్పెషల్ వార్డుకు తరలించి, అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 
 
మార్కెట్లు, సినిమా హాళ్లు లేదా ప్రయాణాలు వంటి రద్దీ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని వైద్యులు ప్రజలను హెచ్చరించారు. ఇది పండుగ సీజన్ కాబట్టి, ప్రజలు మార్గదర్శకాలను పాటించాలని.. తమ కుటుంబాన్ని కోవిడ్ నుండి రక్షించుకోవాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments