Webdunia - Bharat's app for daily news and videos

Install App

36 మంది న్యాయమూర్తుల బదిలీ...గుంటూరుకు ర‌వీంద్ర‌బాబు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (11:05 IST)
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఏ.వి. రవీంద్రబాబును నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రవీంద్ర బాబు చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తూ, ఇక్కడకు బదిలీపై రానున్నారు. ఈ బదిలీల్లో గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్న అయిదు జిల్లాస్థాయి కోర్టులకు న్యాయమూర్తులు నియమితులయ్యారు. 
 
చిత్తూరు జిల్లాలో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ఆర్.శ్రీలతను పదోన్నతి పై గుంటూరు ఐదవ అదనపు జిల్లా మహిళా కోర్ట్ న్యాయమూర్తిగా నియమించారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఒకటవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి విచారిస్తున్న ఫోక్సో కేసులు కూడా ఆమె విచారించేలా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. 
 
గుంటూరు మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా విశాఖపట్నం జువైనల్ కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జి.అర్చనను నియమించారు. గుంటూరు ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా చిత్తూరులో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న పివీఎస్. సూర్యనారాయణ మూర్తిని నియమించారు. కర్నూలు జిల్లా ఆదోని సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎ.సోమశేఖర్ ను గురజాల అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతిపై నియమిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments