Webdunia - Bharat's app for daily news and videos

Install App

బౌద్ధారామాలకు ప్రేమ జంటలు.. 32 యువతులపై అత్యాచారం.. ముఠా అరెస్ట్

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (14:37 IST)
32 మంది విద్యార్థినులపై 20 మందితో కూడిన ఓ ముఠా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి  వెళితే.. ఏపీ, గోదావరి జిల్లాలోని బౌద్ధారామాలకు ప్రేమ జంటలు ఎక్కువగా వస్తుంటారు. జన సంచారం లేని ఈ ప్రాంతానికి వచ్చే ప్రేమ జంటలను ఓ ముఠా టార్గెట్ చేసింది. ఇటీవల ఈ ప్రాంతానికి నవీన్-శ్రీ అనే జంట వచ్చింది. 
 
వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో అక్కడికి వెళ్లిన ఓ ముఠా.. నవీన్‌పై దాడి చేసి.. శ్రీపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడింది. ఇంకా శ్రీని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ క్రమంలో పొట్లూరి అనే వ్యక్తి వద్ద జరిపిన దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పొట్లూరితో పాటు సోమయ్య, గంగయ్య, నాగరాజులతో కూడిన ముఠా ఇదివరకు 32 యువతులపై అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. 
 
ఈ ముగ్గురు యువకులను.. ఇద్దరు యువతులను హతమార్చినట్లు తేలింది. వీరిచే అత్యాచారానికి గురైన 32మంది యువతులు 20ఏళ్లకు లోబడిన వారేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మానవ మృగాలకు కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments