Webdunia - Bharat's app for daily news and videos

Install App

252వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు.. అభిప్రాయ సేకరణకు వెబ్సైట్

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:25 IST)
రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు మంగళవారం 252వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, పెదపరిమి, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజు పాలెం, ఉద్దండరాయుని పాలెం తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది. 
 
అమరావతిపై వెబ్‌సైట్‌
అమరావతికి సంబంధించి మొత్తం వాస్తవాలు అందరికీ తెలియడం కోసం కొత్తగా ఒక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ‘ఏపీ విత్‌ అమరావతి డాట్‌ కాం’ పేరుతో ఈ వెబ్‌ సైట్‌ పెడుతున్నామని, ఇందులో అమరావతిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపడంతోపాటు ఆసక్తి ఉన్నవారు తమ అభిప్రాయాలు పంచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని తెలిపారు.
 
ఏపీ రాజధాని పై ప్రజాభిప్రాయం కోరుదామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విసిరిన ఛాలెంజ్ ని ప్రభుత్వం స్వీకరించలేదు. అందుకే ప్రత్యేక వెబ్ సైటు http://www.apwithamaravati.com  ద్వారా చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని కోరుతున్నారు. 'ఈ వెబ్ సైట్ ద్వారా ఓటు వేయండి. అమరావతిని రక్షించుకోండి' అని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments