Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్వేలులో ప్రేమోన్మాది ఘాతుకం.. బాలిక గొంతు కోసి ప్రాణం తీశాడు...

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (12:12 IST)
ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా కడప జిల్లా బద్వేలులో ప్రేమోన్మాది బాలిక గొంతు కోసి ప్రాణం తీశాడు. బద్వేలు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన సుబ్బయ్య, సుబ్బమ్మల కుమార్తె శిరీష డిగ్రీ చదువుతోంది. అట్లూరు మండలం చిన్నరాజుపల్లెకు చెందిన నారాయణ, పద్మల కుమారుడు చరణ్ హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.
 
శిరీషను ప్రేమిస్తున్నానంటూ చరణ్ కొంతకాలం ఆమె వెంట పడ్డాడు. అందుకు ఆమె తిరస్కరించింది. ఇటీవల ఇంటికి వచ్చిన చరణ్ నాలుగు రోజుల క్రితం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మళ్లీ తిరిగి గ్రామానికి వచ్చి, శుక్రవారం శిరీష ఇంటికి వెళ్లాడు. ఆమెతో మాట్లాడే క్రమంలో…తనతో తెచ్చుకున్నకత్తితో ఆమె గొంతులో పొడిచాడు. అక్కడి కక్కడే ఆమె కుప్పకూలిపోగా కుటుంబ సభ్యులు ఆమెను బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. శిరీష తల్లి తండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా…శిరీషను పొడిచి పారిపోబోతున్న చరణ్‌ను గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ది చేశారు. అతను ప్రమాదకర ద్రావణం తాగాడని తెలిసి పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments