Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవంతో నడిరోడ్డుపై బైఠాయించిన గ్రామస్థులు.. హైవేపై ట్రాఫిక్ జామ్

Webdunia
సోమవారం, 19 జులై 2021 (16:10 IST)
తెలంగాణలోని యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్ వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ఓ గ్రామానికి చెందిన ప్రజలు శవంతో నడి రోడ్డుపై బైఠాయించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వీరి ఆందోళన కారణంగా దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించి పోయింది. 
 
దండు మల్కాపూర్ గ్రామానికి చెందిన యాదమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు కరోనా టీకా వేయించుకోవడానికి వెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన గ్రామస్థులు రహదారిపై ఆందోళనకు దిగారు.
 
మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి రాస్తారోకో నిర్వహించారు. అండర్ పాస్ బ్రిడ్జి లేని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు మండిపడ్డారు. ఈ ఆందోళన నేపథ్యంలో ఇరువైపులా దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 
 
ప్రమాద స్థలి వద్దకు వచ్చిన ఏసీపీ శంకర్ ఆందోళనకారులతో మాట్లాడారు. అనంతరం గ్రామస్థులు ఆందోళనను విరమించారు. ఆ తర్వాత నెమ్మదిగా వాహనాలు కదిలాయి.

సంబంధిత వార్తలు

అమ్మాయిలు షీ సేఫ్ యాప్ తో సేఫ్ గా ఉండాలి : కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

ఫ్యాన్స్ షాక్: కుడిచేతికి కట్టు వేసుకుని కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌కి ఐశ్వర్యా రాయ్ - video

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments