Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ టీడీపీ పగ్గాలు బక్కనికి... చంద్రబాబు నిర్ణయం

Webdunia
సోమవారం, 19 జులై 2021 (15:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి నూతన అధ్యక్షుడుగా బక్కని నరసింహులు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం తర్వాత బక్కని నరసింహులు మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ  బలోపేతం కోసం‌ కృషి చేస్తానని ప్రకటించారు. 
 
టీడీపీలో మాత్రమే దళితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. 
 
చంద్రబాబు కష్టడి హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేస్తే కేసీఆర్, జగన్‌లు అనుభవిస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు నేతలు పార్టీని వీడినా... తెలంగాణలో పార్టీకి  ప్రజల ఆదరణ ఉందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చంద్రబాబుదే తుది నిర్ణయమన్నారు. 
 
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు.  టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈయన స్థానంలో బక్కని నరసింహులును నియమించారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కనికి 1994-99లో షాద్‌నగర్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments