Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ టీడీపీ పగ్గాలు బక్కనికి... చంద్రబాబు నిర్ణయం

Webdunia
సోమవారం, 19 జులై 2021 (15:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి నూతన అధ్యక్షుడుగా బక్కని నరసింహులు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం తర్వాత బక్కని నరసింహులు మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ  బలోపేతం కోసం‌ కృషి చేస్తానని ప్రకటించారు. 
 
టీడీపీలో మాత్రమే దళితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. 
 
చంద్రబాబు కష్టడి హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేస్తే కేసీఆర్, జగన్‌లు అనుభవిస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు నేతలు పార్టీని వీడినా... తెలంగాణలో పార్టీకి  ప్రజల ఆదరణ ఉందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చంద్రబాబుదే తుది నిర్ణయమన్నారు. 
 
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు.  టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈయన స్థానంలో బక్కని నరసింహులును నియమించారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కనికి 1994-99లో షాద్‌నగర్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments