Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ టీడీపీ పగ్గాలు బక్కనికి... చంద్రబాబు నిర్ణయం

Webdunia
సోమవారం, 19 జులై 2021 (15:52 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి నూతన అధ్యక్షుడుగా బక్కని నరసింహులు నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం తర్వాత బక్కని నరసింహులు మాట్లాడుతూ, తెలంగాణలో పార్టీ  బలోపేతం కోసం‌ కృషి చేస్తానని ప్రకటించారు. 
 
టీడీపీలో మాత్రమే దళితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. 
 
చంద్రబాబు కష్టడి హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేస్తే కేసీఆర్, జగన్‌లు అనుభవిస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు నేతలు పార్టీని వీడినా... తెలంగాణలో పార్టీకి  ప్రజల ఆదరణ ఉందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై చంద్రబాబుదే తుది నిర్ణయమన్నారు. 
 
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు.  టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈయన స్థానంలో బక్కని నరసింహులును నియమించారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కనికి 1994-99లో షాద్‌నగర్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments