Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ పోలీస్ లోకి ఒకేసారి 15 వేల మంది చేరిక‌

Webdunia
బుధవారం, 14 జులై 2021 (09:22 IST)
ఏపీ పోలీస్ లోకి ఒకేసారి 15 వేల మంది వ‌చ్చి చేరారు. వారంతా ఎవ‌రో కాదు... గ్రామాల్లోని స‌చివాల‌యాల్లో ప‌నిచేస్తున్న మ‌హిళా సంర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శులు. ఏపీలో వీరంతా పోలీసులే అని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డంతో ఇది సాధ్య‌మైంది. 
 
ఆంధ్రప్రదేశ్‌లో మహిళల భద్రత, రక్షణకు పెద్దపీట వేస్తూ, అనుక్షణం వారికి తోడు నీడగా అన్నివేళలా అందుబాటులో ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గ్రామ, వార్డు సచివాలయల్లోని 15,000 మంది  మహిళ సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తించారు. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 59ని కూడా జారీ చేశారు. దీనితో హర్షం వ్యక్తం చేస్తూ మహిళా పోలీసులు ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
 
మ‌హిళా సంర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శులు పోలీసు శాఖ‌లో అంత‌ర్భాగం అని డీజీపీ స‌వాంగ్ పేర్కొన్నారు. ఈ సంధర్భంగా మహిళా పోలీసులు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తాము పోలీసు శాఖలో అంతర్భాగంగా  రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పోలీస్ శాఖ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ సర్వీసెస్ డి.ఐ.జి పాలరాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మోహన్‌బాబు ఇంట్లో రూ.10లక్షలు చోరీ.. వ్యక్తి అరెస్ట్.. తిరుపతిలో పట్టుకున్నారు..

ఎర్రటి అంచు ఉండే తెల్లచీర కట్టుకుంటా.. చైతూతో పిల్లలు కనాలి: శోభిత

ఎన్ కౌంటర్ అంటే మనిషిని హత్యచేయడమేనా? వేట్టైయాన్ ప్రివ్యూలో అమితాబ్ ప్రశ్న

రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబో మూవీ గేమ్ ఛేంజ‌ర్‌ నుంచి రా మ‌చ్చా మ‌చ్చా ప్రోమో

క సినిమా మాకు జీవితాంతం గుర్తుండే అనుభవాలు ఇచ్చింది : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

4 సంవత్సరాల బాలుడికి ప్రాణాలను రక్షించే కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

తేనెతో డైరెక్ట్ ప్యాక్ వద్దు.. అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తోనే?

తర్వాతి కథనం
Show comments