Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోపాక్ సరిహద్దులను తలపిస్తున్న "ఏపీ సీఎంవో" పరిసరాలు

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (08:22 IST)
సాధారణగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివుంటాయి. దీంతో ఇరు దేశాలు సరిహద్దుల్లో ఇనుప ముళ్ళ కంచెలు వేసివుంటారు. కానీ, ఇపుడు ఇదే దృశ్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కార్యాలయమైన సీఎంవో వద్ద కనిపిస్తున్నాయి. 
 
సీఎంవో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు దాని చుట్టూత ముళ్ల కంచెను వేశారు. దీనికి కారణం లేకపోలేదు. సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయల సంఘాలు ఛలో సీఎంవో (పోరు గర్జన)కు సోమవారం పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు విజయవాడ వ్యాప్తంగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అలాగే పోలీసు యాక్ట్ 30ని కూడా అమలు చేస్తున్నారు.
 
పైగా, పోలీస్ ఆంక్షలను కాదని ఎవరైనా ఛలో సీఎంవోకు వస్తే మాత్రం క్రిమినల్ కేసులు బనాయిస్తామని హెచ్చరికలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవాడ చేరుకోకుండా రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల దగ్గర అడ్డుకుంటున్నారు. యూటీఎఫ్ నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. ఛలో సీఎంవో దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్, సీఎంవో ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని సుమారుగా 800 మందికిపై పోలీసుల బలగాలను మొహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments