Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖోఖో ఆటలో బహుమతి.. మృత్యువు పాము రూపంలో వచ్చింది..

దేశ వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి వాటిలో గెలుపొందిన విజేతలకు బహుమతుల

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (13:27 IST)
దేశ వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి వాటిలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ఇస్తుంటారు. ఇదే తరహాలో శ్రీకాకుళానికి చెందిన దీపిక పాఠశాలలో బహుమతిని గెలుచుకుంది. కానీ జీవితంలో గెలవలేకపోయింది. మృత్యువు పాము రూపంలో రావడంతో దీపిక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని రుంకు గ్రామానికి చెందిన టంకాల దీపిక(13) పాము కాటుతో మృతి చెందింది.  టంకాల అప్పన్న, అమ్మలుకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుతూరు డిగ్రీ చదువుతుంది, చిన్న కుతూరు జగ్ననాథపురంలోని ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. బుధవారం పాఠశాలలో నిర్వహించిన స్వాంతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న దీపిక ఖోఖో ఆటలో గెలుచుకున్న బహుమతితో ఇంటికి వచ్చింది. 
 
ఆమె అందుకున్న బహుమతిని తల్లికి ఆనందంగా చూపించింది. ఆ తర్వాత బావి దగ్గర వున్న అక్క వద్దకు వెళ్లింది. ఆమె బట్టలుతుకుతుండగా, సబ్బు ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. పాము దీపికను కాటేసింది. స్థానికులు, కుటుంబీకుల సాయంతో దీపికను ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments