Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ వాసులకు షాక్.. భద్రతా కారణాలతో ప్యాసింజర్ రైళ్లు రద్దు

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (16:06 IST)
హైదరాబాద్ నగర వాసులకు దక్షిణ మధ్య రైల్వే తేరుకోలేని షాకిచ్చింది. భద్రతా కారణాలు చూపి ఏకంగా 13 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. ఈ విషయాన్ని దక్షణ మధ్య రైల్వే తాజాగా వెల్లడించింది. ఫలితంగా దాదాపు ఆరు నెలల పాటు ఈ సేవలు కనుమరుగు కానున్నాయి. 2020 జనవరి 1 నుంచి జూన్ 30 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది.
 
ప్రస్తుతం రద్దు చేసిన ప్యాసింజర్ రైళ్ల వివరాలను పరిశీలిస్తే, 1. సికింద్రాబాద్ - మేడ్చల్ - సికింద్రాబాద్, 2. సికింద్రాబాద్ - మనోహరాబాద్ - సికింద్రాబాద్, 3. ఫలక్‌నుమా - మేడ్చల్ - ఫలక్‌నుమా, 4. ఫలక్‌నుమా - ఉందానగర్ - ఫలక్‌నుమా, 5. ఫలక్‌నుమా - మనోహరాబాద్ - సికింద్రాబాద్, 6. బొల్లారం - ఫలక్‌నుమా ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. 
 
వీటితోపాటు ఇతర రూట్లలో తిరిగే 12 డెమూ ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే సంస్థ.. ప్రత్యామ్యాయాల్ని విస్మరించింది. దీంతో.. ప్రయణికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా.. రైల్వే స్టేషన్స్‌లో కూడా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments