Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిలో 11వరోజు రైతుల దీక్ష.. దేవినేని సంఘీభావం

Webdunia
శనివారం, 28 డిశెంబరు 2019 (18:03 IST)
రాజధాని గ్రామాల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలకు మద్దతుగా శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు తుళ్లూరు గ్రామంలోని రైతుల దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్,  శ్రావణ్ లతో కలిసి సందర్శించి వారికి సంఘీభావం తెలియజేశారు.
 
ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ మీ త్యాగంతో మీరిచ్చిన భూములలో కట్టిన సచివాలయానికి ముఖ్యమంత్రి జగన్ అసాధారణ పోలీసు భద్రత మధ్య ముళ్ళ కంచెలు వేసుకొని డమ్మీ కాన్వాయ్ ఉపయోగించి రావడం సిగ్గుచేటని దేవినేని విమర్శించారు.
 
రాజధాని కోసం 11రోజులుగా మీరు చేస్తున్న పోరాటం దేశం మొత్తం చూస్తోందని రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని కదిలించిందని అన్నారు.
 
మీకు మద్దతుగా పోరాటం చేస్తున్నందుకు అరెస్టులు చేసి ఇప్పటికే నాపై నాలుగు కేసులు నమోదు చేశారని మీ కేసులకు అరెస్టులకు భయపడేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 
ఈ నెల 3వ తేదీన బీసీజి కమిటీ రిపోర్టు  వస్తుందని 4వ తేదీ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని 18వ తేదీన మీరిచ్చిన భూములలో కట్టిన శాసనసభలో ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తున్నారని దేవినేని అన్నారు.
 
రాజధాని నిలుపుకోవాలని మీరు చేస్తున్న పోరాటాల ముందు, మీ సంకల్ప బలం ముందు ఏ ముఠాల  లాబీయింగ్ లు పనిచేయవని రాజధాని తరలించే శక్తి ఎవరికీ లేదని అమరావతి రాజధానిగా కొనసాగుతుందని దేవినేని పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments